ఏది మంచి, ఏది చెడు? – ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడడు?

By Reddy

ఈ క్రింది విషయం చదివిన తర్వాత నాకొక సందేహం కలిగింది..
మొదట మీరూ చదవండి, తర్వాత నా సందేహం గురుంచి చూద్దాం! 

మహాభారత కురు క్ష్రేత్రయుద్ధంలో, యుద్ధం ముగిసిన పిమ్మట రథం నుండి మొదట రథసారథి దిగటం పరిపాటి. అయితే అర్జునుడికి రథసారథియైన శ్రీ కృష్ణుడు తాను మునుపు దిగక అర్జునుడిని రథం నుంచి దిగమనెను. ఈ పద్ధతి యుద్ధనీతికి వ్యతిరేకమైనప్పటికీ, శ్రీకృష్ణుడి మాటను శిరసావహించి అర్జునుడు రథం నుంచి దిగిన తర్వాత శ్రీకృష్ణుడు కూడా దిగుతాడు. ఆ నిముషానికే రథం పేలుతుంది.

ఈ విషయానికి అర్థం తోచని అర్జునుడితో శ్రీకృష్ణుడు….రామదాసుడైన హనుమంతుడు రాముని అవతారమైన నాకు 18 రోజులు కురుక్ష్రేత్ర యుద్ధ సమయంలో రక్షగా ఉన్నాడని, రధాన్ని కూల్చటానికి వచ్చిన అస్ర్తాన్ని శ్రీకృష్ణుడు దిగే వరకు నిరోధించినట్టు తెలిపాడు. అందుచేత అర్జునుని తొలుత దిగమన్నాడనే అర్ధం అర్జునునికి స్పురింపజేశాడు.

ఇప్పుడు నా సందేహం…

శ్రీకృష్ణుడు యుద్ధనీతిని వ్యతిరేకించినట్టా? లేన్నట్టా?

అర్జునుని రక్షించడం కొరకే చేసాడు అనుకోండి, కాని ఒక మంచి పని చెయ్యడం కోసం నీతిని తప్పవచ్చా అన్నది నా సందేహం?
ఇక్కడ ఈ సందర్భంలో

యుద్ధనీతిని తప్పినా ఎవరికి నష్టం లేదు కాబట్టి తప్పవచ్చు అంటారా? లేదా మంచి కోసం కాబట్టి తప్పవచ్చు అంటారా?

అలా అయితే ప్రతి విషయంలో ఎవరికైనా నష్టం జరుగుతుందా లేదా?, జరిగితే ఎంత నష్టం అని ఆలోచించుకునే సమయం ఎక్కడ ఉంటుంది?

అలా అయితే నష్టం గురించి ఆలోచించకుండా, దాని వల్ల మంచి జరిగితే చాలు చేశేయి అంటారా (ఒక వేల నీతి తప్పవలసివచ్చిన)?
ఎమంటారు?

(మూలం – వెబ్‌దునియా/యాహూ తెలుగు)

Tags: , , , ,

Leave a Reply